యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదు-యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి
అమరావతి: దేశంలోని యూనివర్సిటీలు అందించే MPhil ప్రోగ్రామ్ లకు ఎలాంటి గుర్తింపు లేదని UGC కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు..”UGC యొక్క రెగ్యులేషన్ నంబర్. 14 (కనీస ప్రమాణాలు, Ph.D డిగ్రీని అందించే విధానాలు) నిబంధనలు, 2022లో ఉన్నత విద్యాసంస్థలు ఎటువంటి ఎంఫిల్ ప్రోగ్రామ్ ను అందించకూడదని స్పష్టంగా పేర్కొంటున్నాయి” అని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో MPhil ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని,,MPhil కోర్సులను UGC రద్దు చేసిందని సెక్రటరీ గుర్తు చేశారు..అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు..ఈ నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో MPhil కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది..అయినప్పటికి కొన్ని యూనివర్సిటీలు MPhil కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది..ఆ విషయం UGC దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందన్నారు..