పుష్పాల ఆలంకరణతో శివరాత్రి శోభను సంతరించుకున్న శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి: దక్షిణా కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రం.. శివరాత్రి శోభను సంతరించుకుంది..శనివారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, ఆలయాన్ని సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో,, వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు..నేటి నుంచే భక్తులు శ్రీ కాళహస్తి దేవస్థానంనందు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని దర్శించుకుంటూ, శోభాయమానంగా ముస్తాబైన ఆలయంను భక్తులు ధర్శించుకుంటున్నారు..