AMARAVATHIHYDERABADPOLITICS

తెలంగాణ ముగిసిన అసెంబ్లీ ఎన్నిక పొలింగ్-చెదురుమదురు ఘటనలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది..అక్కడక్కడ చెదురుమదురు ఘటనల తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు..సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్ లలో నిలబడ్డవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు..మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.. మధ్యహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం నమోదైంది.. మొత్తం మీద తెలంగాణలో 65 నుంచి 68 శాతం మధ్యలోనే పోలింగ్ నమోదవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, పోలింగ్ శాతం తగ్గే ఆవకాశం వుంది.. 2018 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయింది.. రాత్రి 7 గంటల తరువాత పోలింగ్ శాతాన్ని ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *