AMARAVATHINATIONAL

జమ్ముకశ్మీర్‌లో లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులు హతం

అమరావతి: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు..బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం వేకువజామున భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి..భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, భద్రతా బలగాలు ఎధురు కాల్లులతో సమాధానం ఇచ్చారు..ఈ కాల్పుల్లో లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులు హతం అయ్యారని Additional Director General of Police విజయ్ కుమార్  తెలిపారు..షోపియాన్‌ జిల్లాకు చెందిన షకీర్‌ మాజిద్‌ నాజర్‌, హానన్‌ అహ్మద్‌లు ఈ సంవత్సరం మార్చి నెలలోనే వీరిద్దరు  ఉగ్రవాద సంస్థలో చేరినట్లు గుర్తించామని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు..సంఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్‌, పిస్తోల్‌, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *