రూ.200 కోట్లు ఆస్తిని విరాళంగా ఇచ్చేసి సన్యాసం స్వీకరిస్తున్నా దంపతులు
అమరావతి: డబ్బు సంపాదన కోసం సమాజంలో ఎంతో మంది అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.ఇందుకు విరుద్దంగా గుజరాత్కు చెందిన జైన దంపతులు దాదాపు రూ.200 కోట్లు ఆస్తిని విరాళంగా ఇచ్చేసి సన్యాసం స్వీకరిస్తున్నారు..జివితానికి పరమార్ధంమైన మోక్ష మార్గంలో పయనించడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.. భండారీ దంపతులు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు.. తమ సంపద మొత్తాన్ని అంటే స్థిర,చర ఆస్తులు…. మొబైల్ ఫోన్లు, ఎయిర్ కండీషనర్లతో సహా తమ వస్తువులన్నింటినీ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు..ఏప్రిల్ 22వ తేదిన అధికారికంగా సన్యాసం స్వీకరించనున్నారు.. హిమ్మత్నగర్లో కుటుంబంతో కలసి నివాసం ఉంటున్న భావేశ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణిస్తున్నారు.. 2022లో భావేశ్ దంపతుల కుమార్తె (19), కుమారుడు (16) కూడా సన్యాసం స్వీకరించారు..తమ పిల్లల్లానే తాము కూడా సన్యాసం స్వీకరిస్తామని ఆ దంపతులు ప్రకటించారు..వారు సన్యాసం స్వీకరించి, ఆ తర్వాత చెప్పులు కూడా ధరించకుండా దేశాటన చేస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తారు..ఆ సమయంలో కేవలం తెలుపు రంగు దుస్తులను మాత్రమే ధరిస్తారు.. రెండు జతల తెలుపు రంగు దుస్తులు మాత్రమే వారి వద్ద ఉంటాయి..అన్ని కోట్ల రూపాయల సంపాదించిన ఆ కుటుంబం అన్నింటినీ వదిలేసి సన్యాసాన్ని స్వీకరించడం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది.