నెల్లూరు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని -మాజీ మంత్రి డాక్టర్ నారాయణ కుమార్తె షరణి
నెల్లూరు: మే 13న ఆలోచించి ఓటు వేయాలని,నెల్లూరు అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి నారాయణ కుమార్త్ షరణి అన్నారు..సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 10 డివిజన్లోని అరుంధతీయవాడ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి పర్యటించారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అమె రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి వేమిరెడ్డి, నారాయణలకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..2014 నుంచి 2019 వరకు నెల్లూరు నగరాన్ని నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 43వేల టిడ్కో గృహాలు మంజూరు,,దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను,, ప్రజలు, చిన్నారులకు అందమైన పార్క్ లను నిర్మించారని గుర్తు చేశారు. నిరుపేదలు కడుపునిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు తీసుకువచ్చారని,,వాటిని కూడా ఈ ప్రభుత్వం మూసేసిందన్నారు. నెల్లూరులోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమని చెప్పారు.