ప్రధాని మోదీ సారధ్యంలో భారత్ వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తొంది-పీయుష్ గోయల్
తిరుమల: మంగళవారం ఉదయం ప్రాతఃకాల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు..అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు..ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషలతో వుండాలని తిరుమల బాలాజీ కోరుకున్నట్లు తెలిపారు..ప్రధాని మోదీ సారధ్యంలో భారత్ వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తొందన్నారు..నేటి తరం యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా,,వారే స్వంతంగా (అంకుర సంస్థలు) స్టార్టప్స్ ప్రారంభించడం అభినందనీయమన్నారు.