అదానీ విషయంలో దాచి పెట్టాల్సింది ఏమి లేదు-అమిత్ షా
2002 నుంచి బీబీసీ మోదీని వెంటాడుతోంది..
అమరావతి: అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు.. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక విషయంలో బీజేపీకి ఎటువంటి భయంలేదని దాచి పెట్టాల్సింది అంతకంటే లేదని హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు..అదానీ గ్రూప్ వివాదం గురించి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని కాబట్టి దీనిపై తాను ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు..అదానీ కంపెనీల విషయంలో బీజేపీపై,, విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ విషయంపై స్పందించటం సరికాదన్నారు..అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు అభాండాలు వేస్తున్నాయని,, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) 2002 నుంచి వెంటాడుతోందని చెప్పారు..ఏదైనా అంశంపై వేలాది కుట్రలు జరిగినప్పటికీ సత్యం కచ్చితంగా వెలుగులోకి వస్తుందని అమిత్ షా చెప్పారు..వలసవాద మనస్థతత్వంతో బీబీసీ 2002 నుంచి మోదీని వెంటాడుతున్నారని చెప్పారు..అయితే మోదీ ప్రతిసారీ మరింత బలపడి,,మరింత ప్రజాదరణను పొందుతున్నారని తెలిపారు.
బీబీసీ కార్యాలయంలో ఐటీశాఖ సర్వే- ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఐటీశాఖ సర్వే నిర్వహిస్తొంది.. పన్నులు ఎగవేతలపై సమాచారం అందడంతో,ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు..