ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు మాకు అభ్యతరం లేదు-ఐక్యరాజ్య సమితి
అమరావతి: ఇండియా పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన విడుదల చేసింది..ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరును భారత్ గా మార్చుతామని అయితే ఇందుకు సంబంధించి భారతదేశ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పష్టం చేశారు..ఈ అంశం ఐక్యరాజ్య సమితి పరిధిలోనిది కాదని, అందువల్ల యునైటెడ్ నేషనల్స్ ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్య చేయదని పేర్కొన్నారు..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్,,ఇతర దేశాధినేతలు హాజరవుతున్నఅంతర్జాతీయ సదస్సులో రాష్ట్రపతిని సంభోదించే తీరును మార్చడం కీలకమైన మార్పుగా రాజకీయ వేశ్లేషకులు భావిస్తున్నాయి..ఒక అధికారిక కార్యక్రమంలో ఇండియా పేరును భారత్ అని మార్చడం ఇదే తొలిసారిని అధికార వర్గాలు అంటున్నాయి.