డిశంబరు నుంచి BSNL 4G సేవలు ప్రారంభం-BSNL CMD PK పూర్వర్
అమరావతి: డిశంబరు నుంచి BSNL 4G సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL CMD PK పూర్వర్ వెల్లడించారు.. అనంతరం ఈ సేవలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు..ఢిల్లీలో జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ అయన ఈ విషయం వెల్లడించారు..4G సేవలకు సంబంధించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా 200 వందల ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు..ఈ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.. 2024 జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.. 5Gకి సంబంధించి స్పెక్ట్రమ్ కూడా తమకు వుందన్నారు.. 4G సేవల విస్తరణ పూర్తయ్యాక 5G కూడా ప్రారంభిస్తామన్నారు.. BSNLలకు సంబంధించి 4G నుంచి 5Gకి అప్ డేట్ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ TCSకు అప్పగించింది..