AMARAVATHIDISTRICTS

పీ.ఎం ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొండి-ఆదాల

జిల్లా అభివృద్ది సమన్వయ కమిటీ..

నెల్లూరు: కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు..శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నెల్లూరు ఎం.పీ అధ్యక్షతన జరిగింది.. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, హౌసింగ్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జాతీయ రహదారులు, రైల్వే శాఖల ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలు జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, వాటి ప్రగతిని కమిటి సమీక్షించింది.. తొలుత చేపట్టిన జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా  అమలు జరుగుచున్న దీన్ దయాళ్ అంతోదయ యోజన,  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ కౌసల్ యోజనా, నేషనల్ సోషల్ అస్సిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ,  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ కౌసల్ యోజనా,  యువత స్వయం శక్తిగా ఎదిగేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడేందుకు చేపడుతున్న  నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు  చేపట్టాలని సూచించారు.. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన గ్రామీణ,,అర్బన్ క్రింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే లబ్ధిదారులకు సంబంధించిన పే మెంట్స్ సకాలంలోయి చెల్లించేల చూడాలని ఎం.పీ, హౌసింగ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద అమలు జరుగుచున్న పనులు పారదర్శకంగా, పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని  డ్వామా పిడిని ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *