కాకినాడ సమీపంలో సముద్రం మధ్య లో ఫిషింగ్ బోట్ అగ్నిప్రమాదం
అమరావతి: కాకినాడ జిల్లా బైరవపాలెం సముద్రం మధ్య లో ఫిషింగ్ బోట్ అగ్నిప్రమాదానికి గురైంది.. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాలకు వచ్చారు అధికారులు..ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో బోటులో వున్న వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో బోటు పూర్తిగా దగ్ధమైంది..అగ్నికీలలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఈత వచ్చిన కొందరు మత్య్సకారులు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.. రూ.80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..వారం కిందట సముద్రంలో వేటకు వెళ్లిన బోటు తుపాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణమైంది..కాకినాడ చేరేందుకు మరో 4 గంటల సమయం ఉండగానే తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది..సమాచారం అందుకుని కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి,,12 మంది మత్స్యకారులను ప్రాణాలతో కాపాడారు..