కేసిఆర్ కుమారై MLC కవితను అరెస్ట్ చేసిన ఈడీ
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో TRS (BRS) MLC కవితను ED అధికారులు అరెస్ట్ చేశారు..శుక్రవారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లికి చేరుకున్న ఐటీ,,ED అధికారులు,, సెర్చ్ వారెంట్ తోపాటు అరెస్ట్ వారెంట్ను కవితకు అందించారు..కవిత ఇంట్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు..అనంతరం ED అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు..శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు PML యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు ED అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు..ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు సమాచారం..కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది..కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేసి,,ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తొంది..కవితను 8.45 గంటలకు విమానంలో ఢిల్లీకి తీసుకున్న వెళ్లనున్నారు.