ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ అయ్యారు..ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని,,అయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు.. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టారు..గురువారం కేజ్రీవాల్ ఇంటికి 12 మంది ఈడీ అధికారుల బృందం వెళ్లింది..లిక్కర్ కేసు,,వాటర్ బోర్డు కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది..కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ కూడా వెళ్లారు.