అగ్రిగోల్డ్ కుంభకోణంపై చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
అమరావతి: అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రమోటర్లు అయిన ఏవి.రావు,,శేషునారాయణరావు,,హేమసుందర్ లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ తో సహా 11 అనుబంధ కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం చార్జిషీట్లు దాఖలు చేసింది..ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ ను విచారణకు స్వీకరించిన హైదరాబాదులోని నాంపల్లి MSJ కోర్టు, అక్టోబరు 3వ తేదిన కోర్టుకు హాజరు కావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు,, అనుబంధ కంపెనీలకు కోర్టు సమన్లు జారీ జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్,,తెలంగాణతో సహా 6 రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది నుంచి దాదాపు 6 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అభియోగం మోపింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఆధారంగా నిధుల మళ్లింపుపై ఈడీ,, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపింది..విచారణలో వెల్లడైన వివరాలు ప్రకారం రెండు విడతల్లో దాదాపు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములు,,భవనాలు,,స్థిర చరాస్తులను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది.