ఆంధ్రప్రదేశ్లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు..అదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు..ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు.. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడతామని, తెలుగు భాషను రక్షిస్తామన్నారు.. జగన్ రెడ్డీ గుర్తుంచుకో బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని స్పష్టం చేశారు..
రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం:- రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.. జగన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు..రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని భరోసా ఇచ్చారు.