AMARAVATHIPOLITICS

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి దోచుకుంటున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ఆరోపించింది..అదివారం నెల్లూరు జిల్లా, కోవూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె వైసీపీపై నిప్పులు చెరిగారు..రాష్ట్రంలో ఎక్కడ చూసిన దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు.. 5 సంవత్సరాలో చేసిన అభివృద్ధి,, హత్యా రాజకీయాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు..చంద్రబాబు, జగన్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు..జగన్​ను నమ్మిన ప్రజల నెత్తిన టోపీ పెట్టి, చేతికి చిప్ప ఇచ్చారని ఎద్దేవా చేశారు.. మొదటి 5 ఏళ్లు బాబు, తరువాత జగన్ అధికారంలో ఉన్నాడు, ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చాయా ? అని షర్మిల ప్రశ్నించారు..10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో, ఇప్పుడు అలానే ఉందన్నారు.. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.. పక్కన హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ ఉంది, మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏముందని ప్రశ్నించారు..బాబు, జగన్ రాజకీయంగా వాడుకున్నారు తప్పిస్తే, హోదా సాధించింది లేదని దుయ్యబట్టారు..జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పులిలా మాట్లాడాడు, అధికారంలో వచ్చాకా పిల్లి అయ్యాడని ఎద్దేవా చేశారు..జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదని, వారసుడు అయితే వైఎస్ఆర్ ఆశయాలు ఎందుకు అమలు చేయలేదని షర్మిల నిలదీశారు..జగన్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని,,2.35లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.. నాలుగున్నర ఏళ్లు నిద్ర పోయి, ఎన్నికల 6 నెలల ముందు నిద్ర లేచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు..నెల్లూరు ఎంపీ గా కొప్పుల రాజును, కోవూరు ఎంఎల్ఏ గా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *