x
Close
CRIME NATIONAL

అఫ్తాబ్‌కు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చిన కోర్టు

అఫ్తాబ్‌కు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చిన కోర్టు
  • PublishedNovember 17, 2022

అమరావతి: తన ప్రియురాలు శ్రద్ధాను అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇస్తూ,శ్రద్దా వాకర్ హత్య కేసులో మరిన్ని నిజాలు రాబట్టేందుకు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చింది.ఇప్పటికే విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ అవిరాల్ శుక్లా ముందు ప్రవేశపెట్టారు.పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరాగా, కోర్టు అఫ్తాబ్‌కు ఐదు రోజుల పోలీసుల రిమాండ్‌కు అప్పగించింది.అఫ్తాబ్, శ్రద్ధా గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు కూడా వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు అతడిని ఆ రాష్ట్రాలకు తీసుకెళ్లనున్నారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ముక్కలుగా కోసేముందు శ్రద్ధా శవంపై వేడినీళ్లు పోశాడు. సులభంగా కోసేందుకు అవకాశం ఉంటుందని అలా వేడినీళ్లు పోసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.35 ముక్కలను 18 ప్యాకింగ్ ల్లో అమర్చాడు. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధాను 6 నెలల క్రితమే దారుణంగా చంపి ఏమీ తెలియనట్లుగా ఉంటోన్న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపడంతో చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నారు.ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.