DISTRICTS

ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు వర్షాలు-జాయింట్ కలెక్టర్

నెల్లూరు: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా రాగల మూడు రోజులు 6, 7, 8 తేదీలలో ఉరుములతో కూడిన వర్షాలు రాష్ట్రమంతా ఉండవచ్చని వ్యవసాయశాఖ తెలియజేసిందని ఇన్చార్జి కలెక్టర్ రోణంకి కూర్మానాద్ శుక్రవారం తెలిపారు. అకాల వర్షాలకు వ్యవసాయ పంటలు ,ఉద్యాన పంటలకు నష్టం కలిగినట్లయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాల్ సెంటర్లలో తెలియజేయవలసిందిగా ఆయన కోరారు..వ్యవసాయ పంటలకు నష్టం జరిగితే 9491000129 కు, ఉధ్యాన పంటలకు నష్టం జరిగితే 8686434649 నంబర్లకు,జిల్లా కేంద్రంలోని1077 కాల్ సెంటర్ కు తెలియజేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *