AMARAVATHI

బెంగుళూరులో వర్ష భీభత్సం-ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నవిజయవాడకు చెందిన మహిళ మృతి

అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు,,మెరుపులతో భారీ వర్షం కురిసింది.. 3 గంటలకు మొదలైన వడగళ్ల వాన సుమారు గంటసేపు భీభత్సవం సృష్టించింది..ఈదురు గాలుల ధాటికి చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు థ్వసం అయ్యాయి..భారీ వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో కే.ఆర్ సర్కిల ప్రాంతంలోని అండర్ బ్రిడ్జిలో ఒక కారు చిక్కుకుని పోయింది..ఇంజిన్ లోకి నీరు వెళ్లడంతో కారు అగిపొయింది..పరిస్థితిని గమనించిన స్థానికులు వారిని బయటకు తీసినప్పటికి,,(23) మహిళ తీవ్ర ఆస్వస్థకు గురై మరణించింది..మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన భానురేఖ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు..కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం.. వరద ముంచెత్తే సమయంలో కారులో భానురేఖతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు.. భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని ఆనందరావు రోడ్,,మెజిస్టిక్,,రేస్ కోర్సు,, కె.ఆర్.సర్కిల్,,టౌన్ హాల్ సర్కిల్,,కార్పొరేషన్,,మైసూర్ బ్యాంక్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది..పలుచోట్ల రోడ్డు ప్రక్కన వాహనాలు పార్కింగ్ చేసి వుండగా, భారీ వర్షం ధాటికి వృక్షాలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి.. కుమార్ కృపా రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఎదురుగా భారీ వృక్షం కూలిపోవడంతో కారు దెబ్బతిన్నది..అదే కారులో ప్రయాణిస్తున్న వారి కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం..దుర్ఘటన గురించి తెలుసుకున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆస్పత్రికి చేరుకొని భానురేఖ కుటుంబాన్ని పరామర్శించి,, రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *