AMARAVATHIDISTRICTS

నెక్లెస్ రోడ్డు దుస్సుస్థితిని చూసి వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ నారాయ‌ణ‌

అధికారంలోకి రాగానే నెక్లెస్ రోడ్డు పూర్తి చేస్తా..

నెల్లూరు: న‌గ‌రంలోని శ్రీ ఇరుక‌ళ‌ల ప‌రమేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద ఉన్న‌ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌,,డిప్యూటీ మేయ‌ర్, రూప్‌కుమార్ తో క‌లిసి గురువారం ప‌రిశీలించారు..ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నెల్లూరు ప్ర‌జ‌లకు ఆహ్లాదం క‌లిగించేందుకు  హైద‌రాబాద్ త‌ర‌హాలో ట్యాంక్ బండ్ నిర్మించాల‌ని త‌లంచి ఆ మేర‌కు ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని చెప్పారు..2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ హ‌యాంలో ఫ‌స్ట్ ఫేజ్ కింద నెల్లూరు స్వ‌ర్ణాల చెరువు వ‌ద్ద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప‌నులు దాదాపు పూర్తి చేశామ‌న్నారు. అయితే మిగిలిన ప‌నులు పూర్తి చేసేలోపు ఎల‌క్ష‌న్ రావ‌డంతో టీడీపీ ప్ర‌భుత్వం మారింద‌న్నారు.అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ నెక్లెస్ రోడ్డు విష‌యాన్ని పూర్తిగా గాలికి వ‌దిలేసి నెల్లూరు ప్ర‌జ‌ల‌కి ఆహ్లాదాన్ని దూరం చేసింద‌ని మండిప‌డ్డారు. ఈ ప‌నులు ఎక్క‌డ పూర్తి చేస్తే టీడీపీకి మంచి పేరు వ‌స్తుందోనని అస‌లు ఆ విష‌యాన్ని మ‌రుగ‌న పెట్టార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త్వ‌ర‌లో జరగనున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని మ‌ళ్లీ గెలిపిస్తే ఆగి పోయిన పనుల‌ను పూర్తి చేసి, నెక్లెస్ రోడ్డును నెల్లూరుకే త‌ల‌మానికంగా తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *