కృష్ణపట్నం పోర్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం
అమరావతి: నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పరిధిలోని అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్ వచ్చింది..ఆన్ లోడింగ్ పూర్తయిన తరువాత క్యాజువల్ కార్మికులు శుక్రవారం మధ్యహ్నం నౌకలోని ట్యాంకర్ను శుభ్రం చేస్తుండగా లోపల వున్న గ్యాస్ కారణంగా క్యాజువల్ కార్మికులు ఖదీర్,, ప్రశాంత్ మృతి చెందారు.. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డినట్లు సమాచారం.. కృష్ణపట్నం పోర్టు SI నాచారయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.