ప్యాంట్లు వేసుకుని వస్తే రైతులు కాదా,కలెక్టర్ తో తేల్చుకుందామని వచ్చా-సోమిరెడ్డి
చెరువుల్లో మట్టి,మషాణం,గ్రావెల్ అమ్ముకునేందుకే మంత్రి..
నెల్లూరు: కనుపూరు చెరువులో జరుగుతున్న ఆక్రమ త్రవ్వకాల గురించి స్పందనలో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు రైతులు వస్తే,,ప్యాంట్లు వేసుకని వచ్చారు మీరే రైతులు అంటూ కలెక్టర్ మాట్లాడడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి అన్నారు..సోమవారం మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రైతులను చులకన చేసిన మాట్లాడిన కలెక్టర్ ఏమైన పైన నుంచి దిగివచ్చాడంటూ ధ్వజమెత్తారు..చెరువుల్లో మట్టి,మషాణం,గ్రావెల్ అమ్ముకునేందుకే జిల్లా మంత్రి పరిమితం అయ్యాడంటూ ఆరోపించారు..చెరువులో అమ్మిన మట్టితో జిల్లాలో కొంత మంది పెద్ద రెడ్లు భారీ బిల్డింగ్ లు కట్టుకుంటున్నారని,,ఇదే సమయంలో 450 అంకణాల్లో, మంత్రి విదేశీ సామాగ్రితో ఇంటిని నిర్మాస్తున్నాడు,, రైతులకు అన్యాయం చేసి పోయ్యేటప్పడు ఎత్తుకుని పోతరా అంటూ మండిపడ్డారు.