AMARAVATHIPOLITICS

ఐదు పైసలు ఖర్చు పెట్టకుండా ఎం.పిగా గెలుపొందిన ముకేష్ దలాల్

అమరావతి: తంతే బూరెల బుట్టలో పడ్డడు అది అతని అదృష్టం అంటే అనే నానుడిని అందరం వినే వుంటాం..అయితే లోక్ సభ ఎన్నికల్లో ఐదు పైసలు ఖర్చు పెట్టకుండా ఓ అభ్యర్థి ఎం.పిగా గెలుపొందాడు..బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ సూరత్ స్థానం పోటీ చేస్తున్నాడు..ఇతనికి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నీలేష్ కుంభానీ ఇటీవల తమ నామినేషన్ దాఖలు చేశారు..ఇంత వరకు బాగానే వుంది..అయితే, ఆయన నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని ముగ్గురు ప్రతిపాదకులు ఎన్నికల అధికారికి అఫిడవిట్‌లో పేర్కొన్నారు..కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని ప్రతిపాదకులుగా అతని బావమరిది జగదీష్ సవాలియా, అతని మేనల్లుడు ధృవిన్ ధమేలియా, భాగస్వామి రమేష్ పొల్లారా అభ్యర్థనను కూడా ఎన్నికల అధికారి వీడియో రికార్డింగ్ చేశారు.. ప్రతిపాదకుల వాదనను అనుసరించి, ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీకి సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం ఇచ్చారు..ఎన్నికల అధికారికి సమాధానమివ్వడానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ తన న్యాయవాదితో వచ్చారు.. అయితే ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరుకాలేదు.. దీంతో అతని నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు..ఇలా నిలేష్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్‌ని వెనక్కు తీసుకోవడంతో.. బీజేపీ అభ్యర్థి సూరత్ నుంచి గెలుపొందారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *