రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ
అమరావతి: ఆగష్టులోను ఎండ వేడితో అల్లడిపోతున్న ప్రజలకు చల్లని వార్త..శుక్రవారం నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు..ఈనెల 18న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడెందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని,,దిని కారణంగా వాతావరణం చల్లబడుతుందని అధికారులు పేర్కొన్నారు..ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది..రేపటికి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..ఇందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉండడంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుందని తెలిపారు..అల్పపీడనం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది..