నాలుగు సంవత్సరాల నుంచి అధికారం మీ చేతుల్లో వుంది ఏంటి పీకారు? -అచ్చెంనాయుడు
నెల్లూరు: ఒక్క అవకాశం అని గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ఒక్క స్థానిక సంస్థ ఎన్నిక కూడా ప్రజల మద్దతుతో గెలవలేదని,,దౌర్జన్యాలు, రౌడీఇజాలతో అక్రమంగా గెలిచారని టీడీపీ రాష్ట్ర అద్యక్షడు అచ్చెంనాయుడు అరోపించారు..మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మేల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్సి ఎన్నికల్లో కూడా అక్రమంగా గెలవడానికి దొంగ ఓట్లు చేర్పించారని,,తిరుపతిలో ఓకే ఇంటి నంబర్ తో 20 ఓట్లు నమోదు చేశారని మండిపడ్డారు..దొంగ ఓట్లను పసిగట్టాం ఓటర్ లుగా చేరిన వారు, చేర్చిన వారు దానిపై సంతకం పెట్టిన ఆఫీసర్ లను జైల్ కు పంపిస్తామంటూ హెచ్చరించారు..జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తే, స్థానిక ఎమ్మెల్యే లు అందుకు ధీటుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నరని ఆరోపించారు.. ఇప్పటి వరకు పెట్టల్సిన ఇబ్బందులు అన్ని పెట్టీ, ఇప్పుడు ఉద్యోగుల అకౌంట్ లో ఓటుకు డబ్బులు వేస్తున్నారని ధ్వజమెత్తారు.