ఏప్రిల్ 8న నుంచి సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ ప్రారంభం!
అమరావతి: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ను ఏప్రిల్ 8వ తేదిన ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు..సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకోనుంది..ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగనుందనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు..ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది..ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 12 గంటలుగా ప్రయాణ సమయం పడుతుండగా, వందేభారత్ లో 6.30 గంటల నుంచి 7 గంటలకు తగ్గనుంది..చివరి నిమిషంలో అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఎదైన అదేశాలు వస్తే తప్ప??