3 గ్యాస్ సిలిండర్లు, రోజు అర లీటరు నందిని పాలు,5 కిలోల గోధుమలు-బీజెపీ మ్యానిఫెస్టో
బీజెపీకీ పెరుగుతున్న మద్దతు…
అమరావతి: మే 10వ తేదిన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 16 హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడ్యూరప్ప సమక్షమంలో విడుదల చేశారు..మ్యానిఫెస్టోకు ‘ప్రజాధ్వని’ అని బీజేపీ పేరు పెట్టింది..అధికారంలోకి వస్తే బెంగళూరు అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారి సమస్యలు చక్కదిద్దుతామని మానిఫెస్టోలో కన్నడ ప్రజలకు హామీ ఇచ్చింది..దారిద్ర్యరేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఉగాది, గణేశ చతుర్ధి, దీపావళి పండుగ నెలల్లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది..సరసమైన ధరకు ఆహారాన్ని అందించేందుకు ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాన్ని కూడా ఏర్పాడు చేస్తామని తెలిపింది..వీటితో పాటు ప్రతినెలా ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం, 5 కిలోల ఉచిత గోధుమలు అందిస్తామని ప్రకటించింది..రాష్ట్రంలోని ప్రతి తాలూకాలో కీమోథెరపీ, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది..యూనిఫాం సివిల్ కోడ్, మత ఛాందసవాదాన్ని నియంత్రించేందుకు ఓ విభాగం, NRC అమలు చేయడం వంటి అంశాలను ఈ మానిఫెస్టోలో పొందుపరిచింది.