2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ
అమరావతి: నల్లధనం దాచిపెట్టిన వాళ్లకు,,బడా రాజకీయ నాయకులకు గుండెల్లో రాళ్ల పడ్డాయి..2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది..కొత్తగా 2 వేల నోట్ల ముద్రణ ఉండదని,,మార్కెట్ లో ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలంటూ శుక్రవారం (19వ తేదీన) ఆర్బీఐ ప్రకటించింది..మే 23వ తేది నుంచి ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది..దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది..ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చిందని ప్రకటించింది..ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది..సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది..ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు.. ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.. అకౌంట్లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.