ఢిల్లీలో ముగిసిన G-20 దేశాల సదస్సు
మహాత్మా గాంధీకి నివాళులు..
అమరావతి: ఢిల్లీలో రెండురోజు పాటు జరిగిన G-20 సదస్సు ఆదివారం రోజున ముగిసింది..రష్యా, ఉక్రెయన్ యుద్ధం నేపథ్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ జరిగినటువంటి ప్రార్థనలతో సదస్సు ముగిసిందని ప్రధాని మోదీ వెల్లడించారు.. G-20 సదస్సు ముగిసినట్లు ప్రకటిస్తున్నానని,,వసుధైక కుటుంబానికి రోడ్ మ్యాప్ దిశగా మనం ముందుకు సాగుతామని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ముగింపు ఉపన్యాసంలో పేర్కొన్నారు..అనంతరం G-20 అధ్యక్ష అధికార దండాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డిసిల్వాకు ప్రధాని మోదీ అందజేశారు..ఈ సదస్సులో చర్చించిన అంశాలపై సమీక్ష జరిపేందుకు ఈ సంవత్సరం నవంబర్ నెల చివర్లో వర్చువల్ సమావేశం జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు..G-20 సదస్సులో చర్చకు వచ్చిన సూచనలు, అంశాలపై చర్యలు, పురోగతిని సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మహాత్మా గాంధీకి నివాళులు:- G-20 దేశాధినేతలు మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు..అదివారం G-20 సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ కి వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు..వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా గాంధీజీకి పుష్పాంజలి ఘటించి,,శాంతి గోడ’పై సంతకాలు చేశారు..
The ideals of Mahatma Gandhi reverberate globally. pic.twitter.com/J4Ko3IXpe4
— Narendra Modi (@narendramodi) September 10, 2023