ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అరెస్ట్
అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్(51)ను బుధవారం ED అరెస్టు చేసింది..ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నార్త్ అవెన్యూలోని ఆయన నివాసంలో ED సోదాలు ప్రారంభించి,,సాయంత్రం అరెస్ట్ చేసింది..ముఖ్యమైన పత్రాలు,, కంప్యూటర్ హర్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంది..ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు,,కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తొంది..వారు తెలిపిన వివరాల మేరకే ఈడీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తొంది..ఈ కేసులో నిందితుడు దినేష్ అరోరా ప్రధాన లింక్ గా భావిస్తున్నారు..దినేష్అరోరా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన నివాసంలో కలిశారని ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొంది..ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత క్రేజీవాల్ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో సంజయ్ సింగ్ కూడా ఉన్నారు..ఒక సందర్బంలో సంజయ్ సింగ్ ను కలిశానని విచారణ సందర్భంగా దినేష్ అరోరా ఈడీ విచారణలో తెలిపారు..