రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ,,తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది..ఈ మేరకు సీఎస్ జహర్రెడ్డికి సమాచారం అందించింది..ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ,, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు..అయన బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే,,కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది..ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.. హరీష్కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు.