AMARAVATHINATIONAL

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ దాడుల్లో లెక్కల్లో చూపని దాదాపు రూ.25 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగినట్లు సమాచారం అందడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది..ఈ వ్యవహారంలో 2023 ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది..ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోమవారం రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు.. 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం కాంగ్రెస్ నాయకుడు మరియు జార్ఖండ్ అసెంబ్లీలో పాకూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా వున్నారు..ఆలం (PA) సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కొండ గుట్టలా వున్న నోట్ట కట్టలుగా నగదు బయటపడింది.. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *