NATIONAL

అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: నేను మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను, ప్రధాన మంత్రిగా కాదు,,ఇక్కడికి రావడం కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. శుక్రవారం అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ ముంబై క్యాంపస్‌ను ప్రారంభించారు..ఈ విద్యా సంస్థను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, మీ వీడియోను నేను చూశాను…కానీ మీ మీద నాకు ఓ ఫిర్యాదు ఉంది…మీరు పదే పదే ప్రధాన మంత్రి అని,, ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారని అన్నారు.. నేను మీ కుటుంబ సభ్యుడిని,, నేను ఇక్కడ ప్రధాన మంత్రినీ కాదు,, ముఖ్యమంత్రినీ కాదు అని అన్నారు..ఇది నా అదృష్టమని భావిస్తున్నాను…ఈ కుటుంబంతో నాకు నాలుగు తరాల అనుబంధం ఉంది…ఈ నాలుగు తరాలవారు మా ఇంటికి వచ్చారు అని చెప్పారు..

ఈ వర్గం ప్రజలు అభివృద్ధి పరీక్షలో ఎప్పుడూ దీటుగా నిలుస్తున్నారని ప్రశంసించారు..అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీని ప్రారంభించడం అంటే మారుతున్న కాలంతోపాటు జరుగుతున్న అభివృద్ధికి చిహ్నమని తెలిపారు.. దావూదీ బోహ్రాలు కాలంతోపాటు నిరంతరం ప్రగతి సాధిస్తున్నారన్నారు..ఆకాంక్షల వెనుక సదుద్దేశం ఉంటే ఫలితాలు ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఉంటాయన్నారు..ఇది దావూదీ బోహ్రా ముస్లింల ప్రధాన విద్యా సంస్థ. ఈ వర్గం ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి విదితమే..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *