ఆత్మకూరు బస్టాండు పరిసరాల్లోని ఆక్రమణలను తొలగించండి – కమిషనర్ వికాస్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు బస్టాండు పరిసరాల్లోని ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ వికాస్ మర్మత్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.రోడ్ల అక్రమణలపై వచ్చిన ఫిర్యాదును పోలీసు అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో గురువారం పర్యటించిన కమిషనర్ స్థానికులతో మాట్లాడి రోడ్లను ఆక్రమిస్తూ ఏలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు.