వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర.గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసిన హైకోర్టు
అమరావతి: వైఎస్ వివేకనందరెడ్డి హత్య కేసులో అయన పి.ఏ ఎర్ర.గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ, మే 5వ తేది లోపు CBI కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది..వైఎస్ వివేక హత్యలో ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని CBI ఆరోపిస్తూ, గంగిరెడ్డి బయట ఉండటంతో సాక్షులు భయపడుతున్నారని హైకోర్టుకు CBI తెలిపింది..CBI వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ పై విధంగా అదేశాలు జారీ చేసింది.. వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి A1 నిందితుడిగా ఉన్నాడు..వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సాక్షాలు తారుమారు చేసిన కేసులో 2019 మార్చి 28న ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యారు..2019 జూన్ 27వ తేదిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు..ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టు, తెలంగాణా కోర్టును ఆశ్రయించింది..