AMARAVATHINATIONAL

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు..ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల లాగా ఉంటారని పిట్రోడా వ్యాఖ్యానించారు..ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్య ఔన్నత్యం గురించి మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది..కాంగ్రెస్ పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తెలిపింది.. భారతీయులపై ఆయన ఎలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారో చూడండి.. విభజించు-పాలించు అనేదే కాంగ్రెస్‌ సిద్ధాంతమని,, ఇది సిగ్గుచేటు అని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌ మండిపడ్డారు..ఈ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. “నేను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తిని కానీ భారతీయుడిలా కనిపిస్తా, వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కనిపించినా మనమంతా ఒక్కటే, కాస్త మన దేశం గురించి కనీస జ్ఞానం పెంచుకోండి” అంటూ హితవు పలికారు.”శామ్‌ పిట్రోడా రాహుల్‌ గాంధీ మెంటార్‌.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *