జై భారత్ నేషనల్ పార్టీ’ని స్థాపించిన జెడి లక్ష్మీనారాయణ
అమరావతి: ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకే “జై భారత్ నేషనల్ పార్టీ’ని స్థాపించామని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్,వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ అన్నారు..శుక్రవారం విజయవాడలో పార్టీ పేరును ప్రకటించిన లక్ష్మినారాయణ తన ఫొటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు.. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా.. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం..మాది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ.. నిరుద్యోగం ప్రధాన సమస్య.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదు.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం.. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దు అని కొందరు.. మరికొందరు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. కానీ మెడలు వంగలేదు.. ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టింది..మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడం..వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు..గత ఎన్నికల్లో పోటీ తరువాత మరింత స్ఫూర్తితో పనిచేశాను..అన్ని వర్గాలను కలిశాను.. అభిప్రాయాలు తీసుకున్నాను..రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన.. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలూ విఫలం అయ్యాయని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.