తర్వలో స్వదేశంలోనే విమానల తయారీ ప్రారంభం-ప్రధాని మోదీ
అమరావతి: కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు..యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని,,ఈ సందర్భంలో యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.. ఎయిర్ పోర్టు మొత్తం పరిశీలంచిన అనంతరం రాబోయే రోజుల్లో భారత్కు వేలాది విమానాలు అవసరం పడుతుందని ప్రధాని మోడీ అన్నారు..ఈ రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు..ప్రస్తుతం విదేశాల నుంచి భారత్కు విమానాలు దిగుమతి అవుతున్నాయని,,త్వరలోనే విమానాలను భారత్లోనే తయారు చేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు..ఎయిర్ పోర్టును ప్రారంభించిన తర్వాత బెలగావి నగరంలో 10.7 కిలోమీటర్ల భారీ రోడ్ షోలో పాల్గొన్నారు.. కారు ఎక్కి రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అభిమానులకు అభివాదం చేశారు. చన్నమ్మ సర్కిల్ నుంచి ధర్మవీర శంభాజీ సర్కిల్, రామలింగ ఖిండ్ గల్లీలోని అశోక సర్కిల్, తిలక్ సర్కిల్ దగ్గర అభిమానులు మోడీపై పూల వర్షం కురిపించారు..జై మోడీ నినాదాలతో రోడ్ షో హోరెత్తింది.
శివమొగ్గ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎయిర్పోర్ట్కు కర్ణాటక కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కువెంపు పేరు పెట్టారు..ఈ విమానాశ్రయం గంటకు 300 మంది ప్రయాణికులను చేరవేస్తుందని తెలిపారు..శివమొగ్గ విమానాశ్రయాన్ని దాదాపు రూ.449 కోట్లతో నిర్మించారు.. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం రోజుకు 7,200 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.