ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ దొరికింది..వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅవినాష్ కు, హైకోర్టు జస్టిస్ లక్ష్మన్,, జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబిఐ విచారణకు హాజరు కావాలన్న షరతు విధిస్తు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు..అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఎం.పీ తెలంగాణ హైకోర్టును ఈ నెల 17వ తేదిన ఆశ్రయించారు..ఈ నేపథ్యంలో మే 31వ తేది వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఈ నెల 27వ తేదిన హైకోర్టు మధ్యంతర తీర్పులు ఇచ్చింది.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరు కావల్సి వుంది..తన తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కాలేదు..సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు..ప్రస్తుతం తన తల్లి బాగోగులు చూసుకోవడం కోసం గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు..ఈ నేపధ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన, తెలంగాణ హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.